Monday, April 29, 2024

ఎంపీ అరెస్టుకు ఇదా సమయం?

నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్టుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వ యంత్రాగాన్ని అంతా కదిలించి ప్రజలను రక్షించవలసి ఉండగా.. ఎంపీ రఘురామకృష్‌ణంరాజును అరెస్టు చేయడం ఏమాత్రం సమర్ధింపు చర్య కాదని పవన్ అన్నారు. ప్రభుత్వాన్ని తరుచు తీవ్రంగా విమర్శిస్తున్నారనే కారణంతో ఎంపీని సమయం, సందర్భంగా లేకుండా అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. ఒక్క పక్క కరోనా సోకిన వారికి ఆస్పత్రుల్లో బెడ్లు దొరక్క, ఆక్సిజన్ అందక, రెమిడిసివర్ ఇంజక్షన్లు బ్లాక్ మార్కెట్లకు తరలిపోతుండగా అవసరమైన మందుల కోసం పది షాపులు తిరగవలసి క్లష్ట పరిస్థితులు నెలకొన్నాయిని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం అంతా ప్రజల బాధలపై దృష్టి పెట్టాలని, ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పోలీసు బలగాలను ఉపయోగించి అరెస్టు చేయడం అప్రజాస్వామికం అని పేర్కొన్నారు.

ఒక్క పక్క ఏపీ నుంచి వైద్యం కోసం వెళ్తున్న అంబులెన్స్ లను పక్క రాష్ట్ర సరిహద్దుల్లో ఆపేసినా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోందని విమర్శించారు. చివరికి తెలంగాణ హైకోర్టు జోక్యం చేసుకుంటే కానీ అంబులెన్స్ లు కదిలే పరిస్థితి రాలేదన్నారు. రాష్ట్రంలో కోవిడ్ ను ఏదో అద్భుతాలు సృష్టించి ఆపమని జనసేన కోరడం లేదన్నారు. వైద్యపరంగా అక్కడున్న వనరులు, వైద్య సిబ్బంది, ఇతర అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని మాట్లడుతున్నామని చెప్పారు. ప్రత్యర్ధి పార్టీ నేతలతో పాటు సొంత పార్టీ ఎంపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు తవ్ర ఇబ్బందులు పడుతున్న ఇలాంటి విమప్కర సమయంలో సొంత పార్టీ ఎంపీని అరెస్టు చేయడంపై చూపించిన శ్రద్ధ ఏ విధంగా హేతుబద్ధమో వైసీపీ ప్రభుత్వం ప్రలజకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఊరూరా కొల్లలుగా కరోనా కేసులు నమోదువుతున్నాయని, ప్రజలు అల్లడిపోతున్నారని అన్నారు. ప్రాణాలు గుప్పెట్లో భయంభయంగా గడుపుతున్నారని చెప్పారు. ప్రజల్లో మనో ధైర్యాన్ని నింపి, ఆక్సిజన్, మందులు, ఆస్పత్రుల్లో బెడ్లు అందేలా ప్రభుత్వం తన దృష్టిని కేంద్రీకరించాలని పవన్ విజ్ఞప్తి చేశారు కొంత కాలంపాటైనా రాజకీయ దమననీతిని కట్టపెట్టాలని పవన్ హితవు పలికారు.  

ఇదీ చదవండి: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ అరెస్ట్!

Advertisement

తాజా వార్తలు

Advertisement