Thursday, May 16, 2024

బీజేపీకి జ‌ల‌క్ : 35వేల ఓట్ల తేడాతో ఆర్జేడీ అభ్య‌ర్థి విజ‌యం

బీహార్ రాష్ట్రంలో ఒక నియోజ‌క‌వ‌ర్గాన‌కి జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో బీజేపీకి జ‌ల‌క్ త‌గిలింది. రాష్ట్రంలోని బొచ్చ‌హ‌న్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో ఆర్జేడీ విజ‌యం సాధించింది. ఆ స్థానం నుంచి అమ‌ర్ కుమార్ పాశ్వాన్ ఆర్జేడీ అభ్య‌ర్థిగా పోటీ చేశారు. అమ‌ర్ సుమారు 35 వేల ఓట్ల తేడాతో స‌మీప బీజేపీ అభ్య‌ర్థి బీబీ కుమారిపై విజ‌యం సాధించిన‌ట్లు ఎన్నిక‌ల సంఘం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఏప్రిల్ 12వ తేదీన ఈ సీటుకు ఉప ఎన్నిక జ‌రిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement