Saturday, April 27, 2024

విద్యార్థులకు చదువుతో పాటు వ్యక్తిత్వాన్ని నేర్పేది గురువులే.. జగన్

విద్యార్థులకు చదువుతో పాటు వ్యక్తిత్వాన్ని నేర్పేది గురువులేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. విజయవాడలో నిర్వహించిన గురుపూజోత్సవం కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ… బతకడం ఎలాగో నేర్పించేది గురువులేనన్నారు. విద్యార్థులు తనకన్నా గొప్పగా జీవించాలని తపించేది గురువేనన్నారు. విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నామన్నారు. విద్యాశాఖపై చేసినన్ని సమీక్షలు మరేశాఖపై చేయలేదన్నారు. మన విద్యా వ్యవస్థ ఎలా ఉందో అందరూ ఆలోచించాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ సంస్థల్లో పనిచేస్తున్న టీచర్లందరికీ సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement