Sunday, April 28, 2024

దేశంలో కొత్తగా 58 వేల కరోనా కేసులు

దేశంలో రోజువారి క‌రోనా కేసుల సంఖ్య క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. 81 రోజుల క‌నిష్ఠ స్థాయిలో కొత్త క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దేశంలో నిన్న 58,419  క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దాని ప్రకారం… నిన్న  87,619 మంది కోలుకున్నారు. 7,29,243 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.  దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,98,81,965కు చేరింది. మరో 1576 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం  3,86,713   కు పెరిగింది. ఇక దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,87,66,009    మంది కోలుకున్నారు. వ్యాక్సినేషన్ కు సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 27,66,93,572 డోసులు ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement