Sunday, May 12, 2024

Breaking: స్వాతంత్ర్య వజ్రోత్సవాలు.. ‘ద్విసప్తాహం’ నిర్వహణపై ప్రగతిభవన్​లో సీఎం కేసీఆర్​ సమీక్ష

తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇవ్వాల (మంగళవారం) సీఎం కేసీఆర్​ అధ్యక్షతన ప్రగతిభవన్​లో సమావేశం జరుగుతోంది. స్వాతంత్ర్య‌ భారత వజ్రోత్సవ ‘‘ద్విసప్తాహం’’ పేరుతో ఈ కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. దీనిపై ఇప్పటికే ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. కాగా, కె.కె.కమిటీతో నిర్వహిస్తున్న ఈ భేటీలో సీఎం కేసీఆర్​ పలు అంశాలపై సమీక్ష జరుపుతున్నారు. ఈ సమావేశంలో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement