Sunday, May 12, 2024

ఉద్దవ్ ప్రభుత్వం కూలిపోతే.. సీఎంగా ఫడ్నవీస్.. డిప్యూటీ సీఎంగా ఏక్ నాథ్..

మహారాష్ట్రలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. రేపు బలపరీక్ష సందర్భంగా ఉద్దవ్ ప్రభుత్వం కూలిపోతే సీఎంగా మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా ఏక్ నాథ్ షిండే కు అవకాశాలున్నాయి. రెబల్ ఎమ్మెల్యేల్లో పది మందికి మంత్రి పదవులు దక్కే అవకాశముంది. ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన మంత్రులకు తిరిగి అవే శాఖలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మలబార్ లోని ఫడ్నవీస్ ఇంటి వద్ద హడావుడి నెలకొంది. ఫడ్నవీస్ ను పలువురు బీజేపీ నేతలు కలుస్తున్నారు. ఫడ్నవీస్ ఇంటి దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement