Sunday, April 28, 2024

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో సునీత‌-ప్ర‌కృతిని కాపాడాల‌ని పిలుపు

గ్రీన్ ఇండియా ఛాలెంజ్..ఇప్పుడు ఈ పేరు తెలంగాణ‌లో మాత్ర‌మే కాదు అంత‌టా ఇదే పేరు వినిపిస్తోంది. ఇప్ప‌టికే ఈ కార్య‌క్ర‌మంలో ఎంతో మంది సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీలు పాల్గొన్నారు. కాగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ జిఎచెంసి పార్క్ లో మొక్క నాటారు టాలీవుడ్‌ స్టార్‌ సింగర్ సునీత.. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ ..ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు.ప్రకృతి కన్నతల్లి లాంటిది కన్నతల్లి ని ఎలా ప్రేమగా చూసుకుంటామో అదే విదంగా మన ప్రకృతి ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని అన్నారు. పర్యావరణ పరిరక్షిద్దాం రాబోయే బావి తరాలకు మంచి వాతావరణం అందిద్దామని కోరారు. అనంతరం సినీ గేయ రచయితలు చంద్రబోస్,రామజోగయ్య శాస్త్రి, డైరెక్టర్ నందిని రెడ్డి ముగ్గురికి గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరారు సునీత. ఈ మేర‌కు సునీత మొక్కలు నాటిన వీడియోని ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement