Saturday, May 11, 2024

Manipur : మరోసారి రీపోలింగ్

మణిపూర్‌లో మరోసారి రీపోలింగ్ నిర్వ‌హించ‌నున్నారు. ఔటర్ మణిపూర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఆరు పోలింగ్ స్టేషన్‌లోలో ఈ నెల 30న రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్వహించింది.

రెండో విడతలో భాగంగా ఈ నెల 26న జరిగిన పోలింగ్ సందర్భంగా ఈ ఆరు పోలింగ్ కేంద్రాల్లో హింసాత్మక ఘటనలు చోసుకున్నాయని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో మంగళవారం మరోసారి పోలింగ్ నిర్వహిస్తామని, ఓటర్లలంతా పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని మణిపూర్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ప్రదీప్ కుమార్ ఝా కోరారు. గత శుక్రవారం జరిగిన పోలింగ్లో ఔటర్ మణిపూర్ లోక్సభ స్థానంలో సుమారు 82 శాతం నమోదయింది. 4.85 లక్షల మంది తమ ఓటువేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement