Friday, April 26, 2024

Breaking: ఇవ్వాలే ఢిల్లీకి టీఆర్​ఎస్​ నేతలు.. ఈసీని కలసి పార్టీ మార్పుపై దరఖాస్తు

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసేందుకు ఇవ్వాల టీఆర్​ఎస్​ నేతలు ఢిల్లీ వెళ్లనున్నారు. ఇప్పటికే అక్కడ పార్టీ ఆఫీసు కూడా తీసుకున్నారు. పార్టీ పేరును రిజిస్ట్రర్​ చేయించేందుకు చర్యలు ముమ్మరం చేశారు. భారత రాష్ట్రీయ సమితిగా కొత్త పార్టీ పేరు ఉండే అవకాశం ఉంది. ఇకమీదట ఢిల్లీ నుంచే పార్టీ కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.

ఇక.. రేపు కేంద్ర ఎన్నికల సంఘానికి పార్టీ పేరు మార్పుపై దరఖాస్తు చేయడానికి పార్టీ నేతలు ఢిల్లీ వెళ్తున్నారు. ఢిల్లీలోని ఎస్పీరోడ్​లో ఆఫీసు నుంచి కార్యకలాపాలు సాగించున్నరు. ఇవ్వాల సాయంత్రమే ఢిల్లీకి వెళ్లనున్న పార్టీ నేత వినోద్​ కుమార్​ తదితరులు. మరికాసేపట్లో ప్రగతి భవన్​లో ప్రారంభం కానున్న సమావేశాలు. ఈ క్రమంలో మీడియాకు ఆహ్వానం లేదని, తర్వాత కేసీఆర్​ మీడియాతో మాట్లాడతారంటున్న పార్టీ నేతలు. ఇందులో భాగంగా ఇవ్వాల సాయంత్రం 4 గంటలకు కేసీఆర్​ ప్రెస్​మీట్​ ఉండే చాన్స్​ ఉందని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement