Monday, April 29, 2024

పునీత్ రాజ్ కుమార్ ఫ్యామిలీని ప‌రామ‌ర్శించిన ‘అల్లు అర్జున్’

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దివంగ‌త క‌న్న‌డ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ కుటుంబాన్ని ప‌రామర్శించారు. విమానంలో బెంగళూరు చేరుకున్న అనంతరం.. . ముందుగా పునీత్‌ రాజ్‌ కుమార్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు బ‌న్నీ. అనంతరం.. పునీత్‌ రాజ్‌ కుమార్‌ సమాధిని.. అల్లు అర్జున్‌ సందర్శించుకున్నారు. పునీత్‌ సమాధి వద్ద బన్నీ నివాళులు అర్పించారు. అనంతరం.. పునీత్‌ రాజ్‌ కుమార్‌ కుటుంబ సభ్యులతో… కలిసి భోజనం చేశారు బన్నీ. గత సంవత్సరం అక్టోబర్‌ 29 వ తేదీన పునీత్‌ రాజ్‌ కుమార్‌ గుండె పోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. జిమ్‌ చేస్తుండగా… గుండె పోటు రావడంతో ఆయన మృతి చెందారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement