Saturday, April 27, 2024

హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ..!: ఇవాళ ప్రకటించే అవకాశం

రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టాక పార్టీలో కొత్త జోష్ వచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, అదే ఒరవడి కొనసాగింపుగా టి.పీపీసీ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హుజురాబాద్ ఉపఎన్నకలకు తమ అభ్యర్థి పేరును ఇవాళ ప్రకటించే అవకాశముంది. ఇక ఇప్పటికే హైదరాబాద్‌ వచ్చిన ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ మణికం ఠాగూర్.. ఇవాళ గాంధీ భవన్‌లో పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించనున్నారు… ఈ సమావేశంలో ముఖ్యంగా గజ్వేల్ సభ, హుజురాబాద్ ఉప ఎన్నికపై చర్చించనున్నట్టుగా తెలుస్తోంది.. ఇక, ఇప్పటికే పలు పేర్లను హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో బరిలో దింపేందుకు పరిశీలించిన పీసీసీ.. ఫైనల్‌గా మాజీ మంత్రి, సీనియర్‌ నేత కొండా సురేఖ వైపు మొగ్గుచూపినట్టు తెలుస్తోంది.. గాంధీ భవన్‌ వేదికగా ఇవాళ జరిగే సమావేశంలో హుజురాబాద్‌ అభ్యర్ధి ఎంపిక కూడా కొలిక్కి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: తీన్మార్ మల్లన్న చరిత్ర ఇది.. గుట్టు విప్పిన Q న్యూస్ మాజీ ఉద్యోగి

Advertisement

తాజా వార్తలు

Advertisement