Friday, May 3, 2024

చెల్లితో ముంబ‌యిలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ – వైర‌ల్ గా ఫొటోస్

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌న చెల్లి శ్రీజ‌తో క‌లిసి ముంబైకి వెళ్ళాడు. ఈ మేర‌కు వారిద్ద‌రు ముంబ‌యి ఎయిర్ పోర్టు ఆవ‌ర‌ణ‌లో ఫొటోల‌కి ఫోజులు ఇచ్చారు. కాగా ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. వారితో పాటు వారి పెట్ డాగ్ రైమ్ కూడా ఉంది. రామ్ చరణ్ న‌టించిన ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాలు విడుద‌ల‌కు సిద్ధ‌మైన విష‌యం తెలిసిందే. కరోనా విజృంభణ నేప‌థ్యంలో ఆ రెండు సినిమాలు వాయిదా ప‌డ్డాయి. క‌రోనా త‌గ్గు ముఖం ప‌ట్టాక ఈ సినిమాల‌ను విడుద‌ల చేయాల‌ని ఆ సినియా యూనిట్లు భావిస్తున్నాయి. ఇప్ప‌టికే విడుద‌ల‌కు సంబంధించి కొత్త తేదీల‌ను కూడా విడుద‌ల చేశాయి. షూటింగుల‌కు విశ్రాంతి దొర‌క‌డంతో రామ్ చ‌ర‌ణ్ ముంబై వెళ్లిన‌ట్లు స‌మాచారం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement