Saturday, April 27, 2024

పార్టీ కోసం క‌మిట్ మెంట్ తో ప‌ని చేస్తున్నా .. 2024త‌ర్వాత రాజ‌కీయాల‌కి గుడ్ బై .. సోము వీర్రాజు ..

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు .. 42ఏళ్ళుగా రాజ‌కీయాల్లో ఉన్నాన‌ని , 2024త‌ర్వాత రాజ‌కీయాల‌లో ఉండ‌బోన‌ని చెప్పారు. ఏపీలో బిజెపి మాత్ర‌మే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉంద‌ని .. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బిజెపికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నాన‌ని అన్నారు.. నేను పదవులు ఆశించి పని చేయలేదు. నాకు సీఎం అవ్వాలని లేద‌ని తెలిపారు. 2014 ఎన్నికల సమయంలోనే రాజమండ్రి సీటుతో పాటు మంత్రి పదవి ఆఫర్ చేశారు. కానీ నేను ఇష్టపడకపోతే ఆకుల సత్యనారాయణకి ఆ అవకాశం దక్కింది. నేను బీజేపీ కార్యకర్తని… పార్టీ కోసం కమిట్‌మెంట్‌తో పనిచేస్తున్నాను. డిసెంబర్ మూడున ‘దివ్య కాశీ…భవ్య కాశీ’ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రధాని మోడీ కాశీ క్షేత్రం పూర్తిగా రూపురేఖలు మార్చారు…కాశీ క్షేత్రం అబివృద్ది కార్యక్రమాలని ప్రధాని మోడీ ప్రారంభించే సందర్బంగా ప్రధాని ప్రసంగాన్ని అన్ని మండలాలలో స్క్రీన్ ల ద్వారా ప్రదర్సిస్తామ‌ని వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement