Wednesday, May 8, 2024

రామోజీ గ్రూపు సంస్థల మాజీ ఎండీ ..అట్లూరి రామ్మోహన్ రావు కన్నుమూత

రామోజీ గ్రూపు సంస్థల మాజీ ఎండీ అట్లూరి రామ్మోహన్ రావు కన్నుమూశారు. ఈయన మీడియా దిగ్గజం రామోజీరావు బాల్యమిత్రుడు . ఈయన వయసు 87 సంవత్సరాలు. రామ్మోహన్ రావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాదులోని ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు మృతి చెందారు. రేపు ఉదయం 10 గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అట్లూరి రామ్మోహన్ రావు జన్మస్థలం కృష్ణా జిల్లా పెదపారుపూడి. బాల్యంలో రామోజీరావు, రామ్మోహన్ రావు కలిసి విద్యాభ్యాసం చేశారు. రామోజీ రావు వ్యాపార రంగంలో ప్రవేశించగా, రామ్మోహన్ రావు ఉపాధ్యాయ వృత్తి చేపట్టారు. 1975లో ఆయన ఉపాధ్యాయ వృత్తిని వదిలి ఈనాడు సంస్థలో చేరారు. ఆపై అంచెలంచెలుగా ఎదిగారు. ఈనాడు డైరెక్టర్ గా, ఎండీగా బాధ్యతలు నిర్వర్తించారు. అంతేకాదు, రామోజీరావు స్వప్నమయిన ఫిలింసిటీ ఎండీగానూ అట్లూరి రామ్మోహన్ రావు కీలక బాధ్యతలు చేపట్టారు. ఇటీవలే పదవీ విరమణ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement