Sunday, May 19, 2024

అమెరికాలో న‌లుగురు భార‌తీయుల కిడ్నాప్-క‌ల‌వ‌ర‌ప‌డుతోన్న కుటుంబ స‌భ్యులు

న‌లుగురు భార‌తీయుల‌ని అమెరికాలోని కాలిఫోర్నియాలోని మెర్సిడ్ కౌంటీ లో కిడ్నాప్ చేశారు. కాగా జస్దీప్ సింగ్ (36), జస్లీన్ కౌర్ (26) దంప‌తులు, వారి ఎనిమిది నెలల చిన్నారి అరూహి ధేరితో పాటు అమన్‌దీప్ సింగ్ (39) కూడా అప‌హ‌ర‌ణ‌కు గురి అయిన‌ట్టు మెర్సిడ్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. వీళ్ల‌ను కిడ్నాప్ చేసిన‌ నిందితుడి ద‌గ్గ‌ర ఆయుధాలు ఉన్నాయ‌ని, అత‌ను ప్రమాదకరమైనవాడని పోలీసులు వివరించారు. దర్యాప్తు ఇంకా ప్రారంభ దశలో ఉన్నందున ఈ సంఘటన గురించి ప‌లు వివరాలు విడుదల కాలేదు. వీళ్ల‌ను అపహరించిన అపహరణ స్థలం చిన్న‌ వ్యాపారులు, రెస్టారెంట్లతో కూడిన రహదారితో కూడిన‌ద‌ని చెప్పారు. అనుమానితుడితో పాటు ఈ న‌లుగురిని కిడ్నాప్ చేయ‌డానికి గ‌ల కార‌ణం ఏమిటో పోలీసులు ఇంకా గుర్తించలేదు. అనుమానితుడు లేదా బాధితులు క‌నిపిస్తే నేరుగా వారి వ‌ద్ద‌కు వెళ్ల‌కుండా అత్య‌వ‌స‌ర నంబ‌ర్‌ 911కి ఫోన్ చేయాల‌ని అధికారులు ప్ర‌జ‌ల‌ను కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement