Wednesday, May 22, 2024

రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిపై శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయాలి… ఎంపీ క‌న‌క‌మేడ‌ల

రాజధాని విషయంలో హైకోర్టు తీర్పును అమలు చేయాలని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని టీడీపీ ఎంపీ క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర కుమార్ అన్నారు. ఆయ‌న మాట్లాడుతూ… ఏపీలో అరాచకాలు పెరిగిపోతున్నాయని ఆయ‌న‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. చట్టం ముసుగులో రాష్ట్రంలో అక్రమాలు, అరాచకాలు ఎక్కువయ్యాయని విమర్శించారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చాక అమరావతిపై జగన్ మాట మార్చారని ఆరోపించారు. అంతేకాకుండా మూడు రాజధానుల విషయంలో ఉత్తరాంధ్రను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. రైతుల పాదయాత్రపై దాడికి కుట్ర జరుగుతోందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement