Saturday, May 18, 2024

ల‌క్క్ అంటే వీరిదే-మూడు లాట‌రీ టిక్కెట్లు కొన్న వృద్ధ దంప‌తులు-కోటీ..20ల‌క్ష‌ల‌పైనే బ‌హుమ‌తి

ఓ వృద్ధ దంప‌తులు మ‌ర్చిపోయి మూడు లాట‌రీ టికెట్లు కొన్నారు. అయితే ఆ మూడు లాటరీ టికెట్లలో మూడింటికీ లాటరీ తగిలింది. ఆ మూడు కూడా ఒకేసారి డ్రా తీసిన లాటరీవి కావడం మరింత విశేషం. మూడింటికీ కలిపి లక్షన్నర డాలర్ల బహుమతి వచ్చింది. అంటే మన కరెన్సీలో కోటీ ..20 లక్షల రూపాయలపైనే. అమెరికాలోని టోసన్ ప్రాంతానికి చెందిన 67 ఏళ్ల పెద్దాయన.. మేరీలాండ్‌ లాటరీకి సంబంధించి రెండు టికెట్లు కొన్నారు. ఆ సమయంలో ఆయనకు చిన్న సర్జరీ అవసరం ఉండటంతో చికిత్స కోసం వెళ్లారు. ఆ కుటుంబానికి అప్పుడప్పుడూ లాటరీ టికెట్లు కొనే అలవాటు ఉండటంతో.. తన భర్త కొన్నాడో లేదో అని భార్య కూడా అదే లాటరీకి సంబంధించి మరో టికెట్ కొనుగోలు చేసింది. సర్జరీ పూర్తయిన తర్వాత వారు.. తమ లాటరీ టికెట్ల పరిస్థితి ఏమిటో చూసుకున్నారు. చిత్రంగా మూడు లాటరీ టికెట్లకూ బహుమతి తగిలింది. లాటరీ తగిలిన దంపతులు వారి పేర్లను ప్రచురించడానికి ఇష్టపడలేదు. అయితే తన భార్య పుట్టిన రోజును తలపించేలా ఉన్న నంబర్లతో లాటరీ టికెట్లు కొన్నామని.. వాటికి బహుమతి తగిలిందని సదరు పెద్దాయన ఆనందంగా చెప్తున్నారు. మూడింటికీ లాటరీ తగిలిన విషయాన్ని తొలుత నమ్మలేదన్నారు. ల‌క్క్ అంటే వీరిదేన‌ని నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement