Saturday, April 27, 2024

రోశయ్యకు కన్నీటి వీడ్కోలు.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రోశయ్య అంత్యక్రయులు ముగిశాయి. కొంపల్లి ఫామ్‌హౌస్‌లో అధికార లాంఛనాలతో రోశయ్య అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియలకు పార్టీలకతీతంగా రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు భారీగా తరలివచ్చి తుది వీడ్కోలు పలికారు. ఏపీ ప్రభుత్వం తరఫున మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్‌, పేర్ని నాని, బాలినేని శ్రీనివాస్‌ హాజరయ్యారు.

అంతకు ముందు గాంధీభవన్‌లో రోశయ్య పార్థీవ దేహాన్ని ఉంచారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గేతో పాటు పలువురు సీనియర్‌ నాయకులు నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా కొంపల్లిలోని ఫాంహౌస్‌ వరకు అంతిమయాత్ర నిర్వహించారు. ఫాంహౌజ్‌లోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement