Friday, April 26, 2024

ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు మావోయిస్టులు మృతి..

పోలీసులు, మావోయిస్టులకు మధ్య జ‌రిగిన‌ ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందిన ఘ‌ట‌న‌ ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో చోటుచేసుకున్నాయి. బీజాపూర్‌లోని పెమెరా అటవీ ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్‌, డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్‌ జవాన్లు సంయుక్తంగా మావోయిస్టుల కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఇరుపక్షాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయని, పోలీసుల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారని బీజాపూర్‌ ఎస్పీ ఆంజనేయ వర్షిణి తెలిపారు. ఘటనా స్థలంలో లభించిన ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement