Friday, April 26, 2024

విశాఖ‌లో కొన‌సాగుతున్న ఐటీ సోదాలు..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలోని పలు కంపెనీల్లో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. వరుసగా మూడో రోజు తనిఖీలు విస్తృతంగా చేస్తున్నారు అధికారులు. కంటైనర్ కంపెనీలో సోదాలు కొనసాగుతున్నాయి. అటు గేట్వే డిస్ట్రీపార్క్ లిమిటెడ్ లోనూ అధికారుల తనిఖీలు జరుగుతున్నాయి. రెండో రోజు నిర్వహించిన సోదాల్లో కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. తప్పుడు బిల్లులు సృష్టించినట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా జీఎస్టీ చెల్లింపులు ఎగ్గొట్టినట్లు ఆయా కంపెనీలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement