Saturday, April 27, 2024

భారీ వర్షాల ఎఫెక్ట్ : నిలిచిపోయిన‌ కేదార్‌నాథ్ యాత్ర

ఉత్త‌రాఖండ్ లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా కేదార్‌నాథ్ యాత్రను నిలిపేస్తున్నట్లు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం ప్రకటించింది. భక్తులంతా ఆలయ పరిసరాలను వీడి హోటళ్లకు వెళ్లాలని సూచించింది. వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో ముందుజాగ్రత్తగా యాత్రను నిలిపివేసింది. రుద్రప్రయాగ్ కమిషనర్ ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ.. గుప్తాక్షి వద్ద దాదాపు 5వేల మందిని ఆపేశామని, హేలి సర్వీసులను కూడా నిలిపేసినట్లు వెల్లడించారు. కాలినడకన వెళ్తున్న భక్తులను ఆపేసి హోటల్స్ కు పంపించామని, ఆలయం వద్దకు రావద్దని భక్తులకు సూచించినట్టు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement