Saturday, May 4, 2024

వామ్మో .. శ్రీలంక‌లో లీట‌ర్ పెట్రోల్ రూ.400

శ్రీలంక‌లో పెట్రోల్ ..డీజిల్ ధ‌ర‌లు ఏకంగా 24.3శాతం పెట్రోల్..38.4శాతం డీజిల్ ధ‌ర‌లు పెరిగాయి. ఇప్ప‌టికే శ్రీలంక తీవ్ర ఆర్ధిక‌..ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. లీటర్ పెట్రోల్ ధ‌ర‌ రూ.82 పెరిగి, రూ.420కి చేరింది. అలాగే, లీట‌రు డీజిల్ ధ‌ర‌ రూ.111 పెరిగి, రూ.400కు చేరింది. ఈ మేర‌కు సిలోన్‌ పెట్రోలియం కార్పొరేషన్ నేటి నుంచే ఈ ధ‌ర‌లు పెంచింది. ఇండియన్‌ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) అనుబంధ సంస్థ లంకా ఐఓసీ కూడా చమురు ధరలను పెంచింది. ర‌వాణా ఛార్జీల‌పై భారం మ‌రింత ప‌డుతుండ‌డంతో అన్ని ర‌కాల వ‌స్తువులు, స‌రుకుల ధ‌ర‌లు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది. ఆటో డ్రైవ‌ర్లు ఇప్ప‌టికే కిలో మీటరుకు ప్రయాణికుడి వద్ద దాదాపు రూ.90 తీసుకుంటున్నారు. శ్రీ‌లంక‌లో ప్ర‌జ‌లు పెట్రోల్‌, డీజిల్, వంటగ్యాస్ తో పాటు ఇతర నిత్యావసరాల కోసం భారీగా క్యూ క‌ట్టాల్సి వ‌స్తోంది. మ‌రోవైపు శ్రీ‌లంక‌లో విద్యుత్‌ కోతలు, ఆహార పదార్థాల కొరత ప్రజ‌ల‌ను వేధిస్తున్నాయి. ఇలా అన్నింట తీవ్ర సంక్షోభం స్ప‌ష్టంగా తెలుస్తోంది. మ‌రి సామాన్య ప్ర‌జ‌లు ప‌డే ఇక్క‌ట్లు అన్నీ ఇన్నీ కావ‌నే చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement