Thursday, May 2, 2024

Breaking : రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్ .. మంత్రి మల్లారెడ్డి

రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్ అని రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలకు కౌంటర్ గా మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ… టీడీపీలో ఉన్న రేవంత్ రెడ్డి తనను కూడా బ్లాక్ మెయిల్ చేశాడన్నారు. లేదంటే నా కాలేజీలు మూయిస్తానని బెదిరించాడన్నారు. ఆయన బ్లాక్ మెయిల్ పై చంద్రబాబుకు కూడా ఫిర్యాదు చేశానని తెలిపారు. రేవంత్ రెడ్డి అన్ని పార్టీలు తిరగాడన్నారు. రేవంత్ రెడ్డికి ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి సీఎం కాడు.. అటెండర్ కూడా కాలేడన్నారు. సీఎం కేసీఆర్ దేశ్ కా నేత అన్నారు. దేశాన్ని సీఎం కేసీఆర్ పాలిస్తారన్నారు. కాంగ్రెస్ హయాంలో భూమి నుంచి ఆకాశం దాకా స్కామ్ లే అన్నారు. ప్రస్తుతం బీజేపీ కూడా అదే పనిచేస్తోందన్నారు. కాంగ్రెస్ దివాళా తీసిన పార్టీ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement