Tuesday, May 14, 2024

Breaking: చికోటి ప్రవీణ్ క్యాసినో కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం

చికోటి ప్రవీణ్ క్యాసినో కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. సినీ, రాజకీయ ప్రముఖులకు ఈడీ నోటీసులు ఇవ్వనుంది. చికోటి ప్రవీణ్ తో పాటు పలువురు ప్రముఖులు నేపాల్ వెళ్లడం, వాట్సాప్ లో చికోటి ప్రముఖులతో చాటింగ్ వంటి అంశాలపై ఈడీ ఆరా తీస్తోంది. 435మంది కస్టమర్లను ఈడీ గుర్తించింది. భారీగా నగదు లావాదేవీలు జరిగినట్లు గుర్తించింది. చికోటి ఫోన్, ల్యాప్ టాప్ ను ఈడీ సీజ్ చేసింది. మొత్తం నాలుగు బ్యాంక్ అకౌంట్లను ఈడీ గుర్తించింది. పెద్దమొత్తంలో హవాలా జరిగినట్లు నిర్ధారించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement