హుజూరాబాద్ ఉపఎన్నిక కోసం టీఆర్ఎస్, బీజేపీ పార్టీల నేతలు పోటాపోటీగా నియోజకవర్గంలో మకాం వేశారు. ఉపఎన్నికకు ఇంకా నోటిఫికేషన్ రాకముందే పార్టీలు ముందే ప్రచారంతో హోరెత్తించేందుకు పార్టీలు సిద్ధమైయ్యాయి. ఈ విషయంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఒక అడుగు ముందే ఉన్నారు. ఇప్పటికే మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రచారం చేస్తున్నారు. ఈసారి తాను బీజేపీ పార్టీ తరఫున బరిలోకి దిగబోతున్నట్లు నియోజకవర్గ ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రచార రథాలను కూడా సిద్దం చేయించారు. బీజేపీ గుర్తు, ప్రధాని మోదీ, బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్తో పాటు తన ఫోటోని కూడా చేర్చి.. ఆకర్షణీయమైన పోస్టర్లతో కూడిన వాహనాలను తయారు చేయించారు. హైదరాబాద్లో ప్రత్యేకంగా రూపొందించిన ఈ వాహనాలు.. హుజురాబాద్కు చేరుకున్నాయి. ఈ ప్రచార రథాలతో ఈటల తన ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు.
మరోవైపు టీఆర్ఎస్ తరపున మంత్రులు రంగంలోకి దిగారు. పార్టీ కార్యకర్తలతో సమీక్షలు చేస్తున్నారు. ప్రభుత్వం కూడా అభివృద్ధి పేరుతో నిధులను కుమ్మరిస్తోంది. దీంతో ఈటల నియోజకవర్గాన్ని చూట్టేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఆన్ లైన్లోనే తరగతులు: తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు