Thursday, May 2, 2024

రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల మద్దతు కోరిన ద్రౌపది ముర్ము

రాష్ట్ర‌ప‌తి ఎన్డీఏ కూట‌మి అభ్య‌ర్థిగా ద్రౌప‌ది ముర్ము ఈరోజు నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ఈ నేప‌థ్యంలో ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల మద్దతును కోరారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ, ఎన్సీపీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్‌తో ముర్ము మాట్లాడిన‌ట్లు తెలుస్తోంది. త‌న అభ్య‌ర్ధిత్వానికి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని ముర్ము ఆ ముగ్గురు నేత‌ల్ని కోరిన‌ట్లు స‌మాచారం. ఈరోజు నామినేష‌న్ స‌మ‌యంలో ప్ర‌ధాని మోదీతో పాటు బీజేపీ రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు ముర్ముకు మ‌ద్దతుగా నిలిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement