Monday, May 20, 2024

ఎమ్మెల్యే తీరుకు నిరసనగా కామారెడ్డిలో ర‌జకుల ధర్నా

కామారెడ్డి : కామారెడ్డిలో రజక సంఘం, మహిళలు సంఘ సభ్యులు నిరసన చేపట్టారు. రజక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన మడెలయ్య గుడి నిర్మాణం పనులు నిలిపి వేసినందుకు, రజకులను కామారెడ్డి ఎమ్మెల్యే దూషించారని ఆరోపిస్తూ చాకలి ఐలమ్మ విగ్రహం ముందు ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. తమ గుడి పనులు నిలిపి వేయవద్దని నినాదాలు చేశారు. నిరసనలో రజక సంఘం మహిళలు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో రజకులు తమ సేవలను ప్రజలందరికీ నిలిపివేశారు. ఇస్త్రీ దుకాణాలు మూసివేశారు, తమ గుడి పనులను నిలిపివేయవద్దని.. అప్పటి వరకు పోరాటం కొనసాగిస్తామని కామారెడ్డి రజక సంఘం నాయకులు డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement