Monday, July 22, 2024

Iran : హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కొల్పోయిన ఇరాన్ అధ్యక్షుడు

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కొల్పోయారు. ఈ విషయాన్ని ఆ దేశ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రమాదంలో ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి హుస్సేన్ అమిర్ అబ్దొల్లాహియాన్, ఇతర అధికారులు కూడా ప్రాణాలు విడిచినట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

ఘటనా స్థలానికి వెళ్లిన ఇరాన్ రెస్ క్రెసెంట్ రెస్క్యూ బృందం.. ఈ విషయాన్ని ధృవీకరించింది. హెలికాప్టర్ పూర్తిగా కాలిపోయిందని తెలిపింది. ఇబ్రహీం రైసీ.. ఇరాన్‌కి వాయవ్యంగా, సరిహద్దులో ఉన్న అజెర్‌బైజాన్‌కి వెళ్లి, ఓ డ్యామ్ ప్రారంభించి.. ఆదివారం తిరిగి ఇరాన్ వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది.

ఆయన ప్రయాణించిన హెలికాప్టర్.. సరిహద్దుల్లో పర్వతాలపై నుంచి వస్తూ.. అక్కడ తీవ్రమైన మంచు ఉండటంతో.. కూలిపోయింది. ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి హుస్సేన్ అమిర్ అబ్దొల్లాహియాన్, ఇతర అధికారులు కూడా చాపర్‌లో ప్రయాణించారు. ఈ ఘటనపై ప్రపంచ దేశాల అధినేతలు విచారం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement