Sunday, May 19, 2024

సికింద్రాబాద్ అల్ల‌ర్ల కేసులో… ఆవుల సుబ్బారావు అరెస్ట్

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో అగ్నిపథ్‌ను నిరసిస్తూ జరిగిన అల్లరు, విధ్వంసం కేసులో సాయి డిఫెన్స్‌ అకాడమీ అధినేత ఆవుల సుబ్బారావును తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. వైద్య‌ప‌రీక్ష‌ల నిమిత్తం సుబ్బారావును గాంధీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వైద్య‌ప‌రీక్ష‌ల త‌ర్వాత ఆయ‌న‌ను బోయిగూడ రైల్వే కోర్టులో హాజ‌రు ప‌ర‌చ‌నున్నారు. అలాగే మేడిప‌ల్లిలోని సాయి డిఫెన్స్ అకాడ‌మీకి కూడా రైల్వే పోలీసులు నోటీసులు జారీ చేశారు. రైల్వే యాక్ట్ 1989 కింద నోటీసులు జారీ చేసిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని నిర్వాహ‌కుల‌కు ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement