Thursday, May 2, 2024

సామాన్యుల‌కు మ‌రో షాక్- రూ.50 పెరిగిన గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌

సామాన్యుల‌కు షాక్ ఇస్తోంది గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర.. డొమెస్టిక్‌ ఎల్పీజీ సిలిండ్‌ ధర మరోసారి పెరిగింది. గృహావసరాల కోసం వినియోగించే 14.2 కేజీల సిలిండర్‌పై రూ.50 పెంచుతూ దేశీయ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్‌లో రూ.1055గా ఉన్న గ్యాస్‌ బండ ధర రూ.1105కు చేరింది. ఢిల్లీలో రూ.1003గా ఉన్న సిలిండర్‌ ధర రూ.1053కు చేరింది. పెంచిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రకటించాయి..అదేవిధంగా ఐదు కేజీల డొమెస్టిక్‌ సిలిండర్‌ ధర రూ.18 పెరిగింది. అయితే 19 కేజీల కమర్షియల్‌ సిలిండర్‌ ధరను కేంద్రం మళ్లీ తగ్గించింది. తాజాగా సిలిండర్‌పై రూ.8.50 కోతవిధించింది. ఈ నెల 1న వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్‌ ధరను రూ.198 తగ్గించిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement