Friday, May 17, 2024

మళ్లీ పెరిగిన కేసులు.. కొత్తగా 16,159 కరోనా కేసులు..


కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి. మంగళవారం 13,086 కేసులు నమోదవగా తాజాగా ఆ సంఖ్య 16,159కి పెరిగింది. దీంతో మొత్తం కేసులు 4,35,47,809కి చేరాయి. ఇందులో 4,29,07,327 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,270 మంది మరణించారు. అయితే గత కొన్ని రోజులుగా కరోనా బాధితులు భారీగా పెరుగుతుండటంతో యాక్టివ్‌ కేసులు 1,15,212కు చేరాయి. కాగా, మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు మరో 28 మంది మహమ్మారికి చనిపోయారు. 15,394 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో 0.26 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement