కాంగ్రెస్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ… రాజీనామాపై వెనక్కి తగ్గలేదన్నారు. ఈ ప్రకటన తర్వాత తాను కాంగ్రెస్ లో లేనట్టేనన్నారు. అందరినీ ఒప్పించి మూడు నాలుగు రోజుల్లో రాజీనామా చేస్తానన్నారు. తనపై దుష్ప్రచారం తనకు బాధ కలిగించిందన్నారు. తనపై బురద చల్లారనే పార్టీని వీడుతున్నానన్నారు. ఇప్పటికే సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి లేఖ రాశానన్నారు. త్వరలోనే రాజీనామా పత్రాన్ని పంపిస్తానన్నారు. తాను ఎవరికీ భయపడనన్నారు. తనను ప్రణాళికా బద్దంగా కోవర్ట్ అని ప్రచారం చేస్తున్నారన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా కాంగ్రెస్ లోనే కొనసాగానన్నారు. తన తీరు వల్ల కొంత మందికి ఇబ్బంది కలగొచ్చన్నారు. వేరే పార్టీలోకి వెళ్లాలనుకుంటే తనను ఎవరూ ఆపగలరని అన్నారు. ఏ రాజకీయ పార్టీలో చేరాలని లేదన్నారు. తాను పార్టీని వీడినా కాంగ్రెస్ కు నష్టమేమీ జరగదన్నారు. తాను పార్టీ నుంచి తప్పుకుంటేనే తన గురించి చర్చ ఉండదన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital