Sunday, May 5, 2024

త‌క్ష‌ణ‌మే ద‌ళిత‌బంధు అమ‌లు చేయండి..’రాజాసింగ్’..

ద‌ళిత‌బంధు ఎప్ప‌టి నుంచి అమ‌లు చేస్తారో సీఎం కేసీఆర్ చెప్పాల‌ని డిమాండ్ చేశారు బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్..ఈ నెల 4నుంచే ద‌ళిత బంధుని అమ‌లు చేస్తామ‌న్నార‌ని ఆయ‌న గుర్తు చేశారు. త్వ‌ర‌గా ద‌ళిత‌బంధును రాష్ట్ర‌మంతా అమ‌లు చేయాల‌ని తెలిపారు. దీపావళి సందర్భంగా పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్రం ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించినందున రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంపై ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని రాజాసింగ్‌ అన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలను అడ్డం పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తుందని ఆయన గుర్తు చేశారు. కేంద్రాన్ని విమర్శించే స్థాయి టీఆర్‌ఎస్‌ నాయకులకు లేదని రాజాసింగ్ స్ప‌ష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement