Tuesday, May 14, 2024

ద‌లైలామాతో భేటీ అయిన ఆర్ ఎస్ ఎస్ చీఫ్ ‘మోహ‌న్ భ‌గ‌వ‌త్’

ధ‌ర్మ‌శాల‌లోని ద‌లైలామా నివాసానికి వెళ్లారు ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్. ఈ సంద‌ర్భంగా ద‌లైలామాతో గంట‌సేపు చ‌ర్చ‌లు జ‌రిపారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై దలైలామాతో చర్చించినట్టు తెలిపారు. క‌రోనా నేప‌థ్యంలో ఇన్ని రోజులు త‌న‌ని క‌ల‌వ‌డానికి అనుమ‌తిని ఇవ్వ‌లేదు ద‌లైలామ‌. కాగా ఈ నెల 15నుంచి ఆయ‌న్ని క‌లిసేందుకు అవ‌కాశాన్ని ఇచ్చారు. ప్రవాస టిబెటన్ అధ్యక్షుడు పెంపా తెర్సింగ్, ఆయన మంత్రివర్గం, టిబెటన్ పార్లమెంట్ స్పీకర్ సోనమ్ టెంఫెల్ ను కూడా మోహన్ భగవత్ కలిశారు. హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల, కాంగ్రాలో ఐదు రోజుల పర్యటనలో భగవత్ ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన దలైలామాను కలిశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement