Sunday, May 19, 2024

దలైలామాను కలిసిన RSS చీఫ్ మోహన్ భగవత్

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ సోమవారం ధర్మశాలలో టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామాను కలిశారు. మెక్లీడ్‌గంజ్‌లోని దలైలామా నివాసంలో దాదాపు గంటసేపు ఆయనతో చర్చలు జరిపారు.

కరోనా నేపథ్యంలో ఇన్ని రోజులు తనను కలవడానికి దలైలామా అనుమతిని ఇవ్వలేదు. ఈ నెల 15 నుంచి కలిసేందుకు అవకాశం ఇస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల పర్యటనలో మోహన్ భగవత్ ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన దలైలామాను కలిశారు. ప్రవాస టిబెటన్ అధ్యక్షుడు పెంపా తెర్సింగ్, ఆయన మంత్రివర్గం, టిబెటన్ పార్లమెంట్ స్పీకర్ సోనమ్ టెంఫెల్ ను కూడా మోహన్ భగవత్ కలిశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement