Sunday, April 28, 2024

ఫ్యాక్ట్ చెక్: ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపు! నిజమేనా?

జులై నుంచి కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం (డీఏ), పింఛనుదారులకు కరవు ఉపశమనాన్ని (డీఆర్) పునరుద్ధరిస్తున్నట్టు ఓ ఉత్తర్వు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కోవిడ్ -19 సంక్షోభ సమయంలో ఆగిపోయిన కరువు భత్యం (డీఏ) జులై 1, 2021 నుంచి అందిస్తామంటూ ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్ పేరిట ఉన్న ఉత్తర్వులు నెట్టింట్లో చక్కర్లు కొట్టింది. అయితే, దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టతనిచ్చింది. అది ఫేక్ అని, అలాంటి జీవోను ఇవ్వలేదని స్పష్టం చేసింది. ‘’సోషల్ మీడియాలో ఓ డాక్యుమెంట్ చక్కర్లు కొడుతోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, పింఛన్ దారులకు డీఆర్ ను పునరుద్ధరిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. కానీ, అది నకిలీది’’ అని ట్వీట్ చేసింది.

దాదాపు 50 లక్షల మంది ఉద్యోగులపాటు 61 లక్షల మంది పింఛనుదారులకు డీఏ పెంచాలని గత ఏడాది ఏప్రిల్ లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.  అయితే, మహమ్మారి నేపథ్యంలో ఈ ఏడాది జూన్ 30 వరకు పెంపును ఆపింది. ఈ నేపథ్యంలోనే ఆ ఉత్తర్వు హల్ చల్ చేస్తోంది. అయితే, ఆ ఉత్తర్వులు నకిలీవని ప్రభుత్వం ప్రకటించడంతో ఉద్యోగులు, పెన్షనర్లు చాలా నిరాశకు గురయ్యారు.

కాగా, కరోనా ఉధృతి కారణంగా  2020 జనవరి నుంచి కరువు భత్యం (డీఏ) ప్రకటించలేదు.  కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగించడంతో 2020- 2021 వరకు ఉద్యోగులకు సంబంధించి మూడు డీఏలు, పెన్షనర్లకు సంబంధించి మూడు డీఆర్‌లు పెండింగ్‌లో ఉన్నాయి.

ఇది కూడా చదవండి: భారత్ లో కరోనా థర్డ్ వేవ్ రాదు: ఐసీఎంఆర్ కీలక ప్రకటన

Advertisement

తాజా వార్తలు

Advertisement