Thursday, April 25, 2024

భారత్ లో కరోనా థర్డ్ వేవ్ రాదు: ఐసీఎంఆర్ కీలక ప్రకటన

కరోనా సెకండ్ వేవ్ లో భారత్ విలవిలలాడింది. మహమ్మారి దెబ్బకు వేలాది మంది ప్రాణలు కోల్పోయారు. ప్రస్తుతం వైరస్ ఉద్ధృతి తగ్గినా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో ఐసీఎంఆర్ కీలక ప్రకటన చేసింది. భారత్​లో కరోనా థర్డ్ వేవ్ వచ్చేందుకు అవకాశాలు తక్కువగానే ఉన్నట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ఒకవేళ వచ్చినా సెకండ్ వేవ్ అంత తీవ్రంగా ఉండదని పేర్కొంది. ఉపద్రవాన్ని ఎదుర్కోవడంలో వేగంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్ కీలక పాత్ర పోషిస్తుందని ఐసీఎంఆర్ తెలిపింది.

ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ ఇతర వైద్య నిపుణులతో కలిసి అధ్యయనం చేశారు. థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు తక్కువేననే విషయం ఈ అధ్యయనంలో తేలింది. రోగనిరోధక శక్తి క్షీణించటం, రోగనిరోధక శక్తిని తప్పించుకొనేలా వైరస్​లో మార్పులు రావటం వంటి కారణాలు మూడో ఉద్ధృతికి దారితీసే అవకాశాలు తక్కువేనని ఇందులో అభిప్రాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement