Sunday, May 12, 2024

తెలంగాణలో కరోనా పంజా.. కొత్తగా 3,840 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 3,840 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గురువారం మరో 9 మంది కరోనాతో మరణించారు. కొత్తగా 1,198 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30,494 యాక్టివ్‌ కేసులున్నాయని, 20,215 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

కొత్తగా నమోదైన కేసులో అత్యధికంగా 505 జీహెచ్‌ఎంసీలో, మేడ్చల్‌లో 407, రంగారెడ్డిలో 302, నిజామాబాద్‌లో 303, సంగారెడ్డిలో 175 కరోనా కేసులు నమోదయ్యాయి. గురువారం రోజు రాష్ట్రంలో 1,21,880 కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,41,885కి చేరగా ఇప్పటి వరకు 3,09,594 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement