Saturday, April 27, 2024

కొత్తగా 1,046కరోనా కేసులు..53మంది మృతి

నేడు కొత్తగా 1,046కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా 53మంది మృతి చెందారు. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు రెండు వేలకు లోపే నమోదవుతున్నాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,54,638కి చేరింది. ప్రస్తుతం దేశంలో 17,618 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో కరోనా కారణంగా 53 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 5,29,077కి చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో 0.04 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98. 78శాతం, మరణాలు 1.18 శాతంగా ఉన్నాయని తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 219.64 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement