Monday, May 6, 2024

తెలంగాణలో 500 లోపే కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు తగ్గాయి. గడచిన 24 గంటల్లో 89,675 నమూనాలు పరీక్షించగా.. 453 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. రాష్ట్రవ్యాప్తంగా 591 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 69 కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 55, వరంగల్ అర్బన్ జిల్లాలో 38 కేసులు నమోదైయ్యాయి. తెలంగాణలో ఇప్పటిదాకా 6,51,288 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 6,39,456 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8,137 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనా కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 3,836కి చేరింది.

ఇది కూడా చదవండిః చిన్న వాటికి ఆశ‌ప‌డ‌కండి: హజురాబాద్ ఓటర్లకు హరీష్ పిలుపు

Advertisement

తాజా వార్తలు

Advertisement