Saturday, April 27, 2024

పంద్రాగ‌స్టు ప‌ర్వ‌దినం.. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జాతీయ జెండా ఎగ‌రేసిన సీఎం కేసీఆర్‌..

స్వతంత్ర‌ భారత వజ్రోత్సవ వేడుకల్లో 76వ భాగంగా ఇవ్వాల (సోమ‌వారం) స్వాతంత్య్ర‌ దినోత్సవాన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో జాతీయ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మ‌ధుసూద‌నాచారి, ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్‌తో పాటు ప‌లువురు లీడ‌ర్లు, ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జాతీయ జెండా ఎగుర‌వేసిన త‌ర్వాత‌ సీఎం కేసీఆర్ సికింద్రాబాద్ ప‌రేడ్ గ్రౌండ్‌కు చేరుకున్నారు. అక్క‌డ అమ‌ర జ‌వానుల స్మృతి చిహ్నం వ‌ద్ద నివాళుల‌ర్పించారు. స్వ‌తంత్ర భార‌త స్వ‌ర్ణోత్స‌వ వేళ‌.. భార‌త స్వాతంత్య్రోద్య‌మ‌ అమర వీరుల త్యాగాలను కేసీఆర్ స్మ‌రించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement