Saturday, April 27, 2024

Vikarabad: విద్యార్థిని హత్యాచారం కేసు.. దర్యాప్తులో కీలక విషయాలు

వికారాబాద్‌ జిల్లా పూడూర్‌ మండలం అంగడి చిట్టంపల్లిలో సంచలనం సృష్టించిన విద్యార్థిని అత్యాచారం, హత్య కేసులో పురోగతి కనిపిస్తోంది. పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. బాధిత విద్యార్థినిపై ఆమె స్నేహితుడే హత్యాచారానికి పాల్పడినట్లు దాదాపుగా నిర్ధారణ అయ్యింది. ప్రధాన నిందితుడు మహేందర్‌ అలియాస్‌ నాని నేరం ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. తాగిన మైకంలో లైంగిక వాంఛ తీర్చమని సదరు విద్యార్థినిని నిందితుడు బలవంత పెట్టాడు. అయితే ఆమె ఒప్పుకోకపోవడంతో ఉదయం కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లిన బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం తలను చెట్టుకు బాది.. ఊపిరి ఆడకుండా చేసి చంపినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. కీలక ఆధారాలతో పోలీసులు నేడు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement