Monday, April 29, 2024

India Corona: 24 గంటల్లో 1233 కరోనా కేసులు.. 31 మరణాలు

దేశంలో కరోనా మహమ్మారి దాదాపు పూర్తిగా తగ్గుతోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 1233 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,30,23,215 కు చేరింది. ఇక, 31 మంది కరోనాతో మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5,21,101కి పెరిగింది.

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1876 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశవ్యాప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,24,87,410 కు చేరింది. దేశంలో 14,704 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా పాజిటివిటి రేటు 87.76 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,83,82,41,743 కరోనా వ్యాక్సిన్లు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement