Wednesday, May 8, 2024

లులు గ్రూప్ ఎండీకి తప్పిన పెనుప్రమాదం

కేరళలో ఓ హెలికాప్టర్‌కు పెను ప్రమాదం తప్పింది. యూఏఈకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, లులు గ్రూప్ ఎండీ ఎంఏ యూసుఫ్ అలీ, ఆయన భార్య ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఎర్నాకుళం పరిసరాల్లో క్రాష్ ల్యాండింగ్ అయ్యింది. పనాంగడ్ వద్ద చిత్తడి భూమిలో హెలికాప్టర్ ల్యాండ్ కావడంతో ఏవియేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆదివారం ఉదయం 8:45 గంటలకు నివాస ప్రాంతాలు ఉండే ప్రదేశంలో హెలికాప్టర్ ల్యాండ్ అయ్యింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కాగా సాంకేతిక లోపం కారణంగానే హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో ఒక పెద్ద విషాదాన్ని తప్పించిందని పేర్కొన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement