Wednesday, May 8, 2024

రేపు అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబు దీక్ష

ఏపీలో కరోనా బాధితులను ఆదుకోవాలనే డిమాండ్‌తో మంగళవారం నాడు తెలుగుదేశం పార్టీ ఆందోళనకు సిద్ధమవుతోంది. ‘సాధన దీక్ష’ పేరుతో రేపు ఏపీ వ్యాప్తంగా నిరసన దీక్షలను చేపట్టబోతోంది. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు దీక్షను చేపట్టనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు చంద్రబాబు దీక్ష కొనసాగనుంది. ఈ దీక్షలో ఆయనతో పాటు మరో 15 మంది టీడీపీ సీనియర్ నేతలు పాల్గొనబోతున్నారు.

కాగా టీడీపీ సీనియర్ నేత, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం కరోనా బాధితులను ఆదుకోకుంటే భవిష్యత్ కార్యాచరణను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. చంద్రబాబు దీక్షతో అయినా జగన్ ప్రభుత్వంలో చలనం రావాలని ఆయన ఆకాంక్షించారు. ఆక్సిజన్ అందక మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.25 లక్షలు, కరోనా మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల తక్షణ సాయాన్ని అందించాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement