Tuesday, May 21, 2024

నాకు తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం: షర్మిల

ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న జలవివాదంపై వైఎస్ షర్మిల స్పందించారు. తనకు తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమని ఆమె స్పష్టం చేశారు. ‘ఈమె తెలంగాణ కోసం నిలబడుతుందా? ఈమె తెలంగాణ కోసం పోరాడుతుందా? తెలంగాణకు అన్యాయం జరిగే ప్రాజెక్టులను అడ్డుకుంటుందా? అని చాలామంది అనుకుంటుండొచ్చు. మాట మీద నిలబడే రాజన్న బిడ్డగా చెబుతున్నా… తెలంగాణకు దక్కాల్సిన ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోం. తెలంగాణకు అన్యాయం జరిగే ఏ ప్రాజెక్టునైనా, ఏ పనినైనా నేను అడ్డుకుంటా. తెలంగాణ ప్రజల కోసం నిలబడతా. తెలంగాణ ప్రజల కోసం ఎవరితోనైనా కొట్లాడతా’ అని షర్మిల వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement