Friday, April 26, 2024

పీసీపీ చీఫ్ గా రేవంత్… మొక్కులు చెల్లించిన సీతక్క

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎంపీ రేవంత్ రెడ్డి ఎన్నిక కావడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీత‌క్క మొక్కులు చెల్లించుకున్నారు. పీసీసీ రేసులో ఉన్న రేవంత్ రెడ్డికి రావాల‌ని మేడారం అమ్మ‌వారిల‌కు మొక్కుకున్నారు. తాజాగా రేవంత్ రెడ్డికి పీసీసీ ప‌ద‌వి ద‌క్క‌టంతో ఎమ్మెల్యే సీత‌క్క మొక్కులు చెల్లించారు. ఊరేగింపుగా వెళ్లిన సీత‌క్క అమ్మ‌వారిల‌కు ప్ర‌ద‌క్షిణ‌లు చేసి… మొక్కు చెల్లించారు. తన సోదరుడు రేవంత్ కు ప‌ద‌వి ద‌క్క‌టం ప‌ట్ల సీత‌క్క సంతోషం వ్య‌క్తం చేశారు. రేవంత్‌ పీసీసీ పదవి ఇచ్చినందుకు సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు.

కాగా, అన్న‌-చెల్లెలుగా ఒక్క‌టిగా ఉండే రేవంత్ రెడ్డి, సీత‌క్క టీడీపీకి రాజీనామా చేసి ఒకేసారి కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి: వీహెచ్‌కు రేవంత్ పరామర్శ.. కొత్త అధ్యక్షుడికి కీలక సూచన!

Advertisement

తాజా వార్తలు

Advertisement