Sunday, May 19, 2024

Breaking : ‘యుద్ధ‌నౌక‌’ను జాతికి అంకితం చేసిన సీఎం జ‌గ‌న్

విశాఖ‌ : యుద్ధ‌నౌక‌ను జాతికి అంకితం చేశారు సీఎం జ‌గ‌న్. స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతో విశాఖ‌ప‌ట్నం యుద్ధ‌నౌక త‌యార‌యింది. ఐఎన్ ఎస్ స‌బ్ మెరైన్ ను సంద‌ర్శించారు సీఎం జ‌గ‌న్. కాగా సాయంత్రం బీచ్ రోడ్డులో అంత‌ర్జాతీయ నేవీ ప‌రేడ్ జ‌ర‌గ‌నుంది. అలలతో పోటీపడుతూ భారత నావికా దళ సామర్థ్యాల్ని ప్రదర్శించే వేడుకకు విశాఖ నగరం సిద్ధమైంది. అంతర్జాతీయ విన్యాసాల వేదిక మిలాన్‌–2022లో కీలకమైన ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌ను బీచ్‌ రోడ్డులో ఘనంగా నిర్వహించేందుకు నౌకాదళం, జిల్లా యంత్రాంగం పూర్తి ఏర్పాట్లుచేశాయి. కార్యనిర్వాహక రాజధాని నగరం పేరుతో రూపుదిద్దుకున్న ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం యుద్ధనౌకను జాతికి అంకితం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement