Saturday, April 27, 2024

Breaking : ఇరాక్ లోని యూఎస్ కాన్స‌లేట్ పై క్షిప‌ణులు

ఇరాక్ లోని యూఎస్ కాన్స‌లేట్ పై క్షిప‌ణులు దాడి చేశాయి.12రాకెట్ల‌తో ఇరాన్ దాడి చేసింది. ఈ దాడిలో భ‌వ‌నం ధ్వంసం అయింది. అయితే ఈ ఘ‌ట‌న‌లో ప్రాణ‌న‌ష్టం త‌ప్పింది. ఈ మేర‌కు ఇరాక్, అమెరికా భద్రతా అధికారులు ఓ ప్ర‌క‌ట‌న చేశారు. ఇర్బిల్లోని సలాహ్ అల్ దిన్ ప్రాంతంలో ఆ కార్యాల‌యం ఉంటుంద‌ని, దాని ప‌క్క‌నే కుర్దిస్థాన్ 24 టీవీ స్టేషన్ ఉంటుంద‌ని ఇరాక్ అధికారులు తెలిపారు. పేలుళ్ల వ‌ల్ల ఆ టీవీ ఛానల్, కాన్సులేట్ భవనం కిటికీలు, పలు సామగ్రి మాత్రమే ధ్వంసమయ్యాయని వివ‌రించారు. అక్క‌డే ఉండే ఇర్బిల్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఎలాంటి ప్రభావం ప‌డలేద‌ని, ఒక్క విమానం కూడా రద్దు కాలేదని తెలిపారు. ఇరాన్ నుంచే ఈ క్షిప‌ణుల‌ను ప్రయోగించినట్లు తెలిపారు. అమెరికా జవాన్లలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఆ దేశ భ‌ద్ర‌తా అధికారి చెప్పారు. క్షిప‌ణులు ఎక్కడెక్క‌డ ప‌డ్డాయ‌న్న విష‌యంపై వివ‌రాలు తెలియాల్సి ఉంద‌ని తెలిపారు. ఈ బాలిస్టిక్ మిసైల్స్ను ఇరాన్ ప్ర‌యోగించిన‌ట్లు తెలుస్తోంది. ఎందుకంటే సిరియా, డమస్కస్ లో ఇటీవ‌ల‌ దాడి చేసిన ఇజ్రాయెల్… ఇరాన్ రెవల్యూషనరీ గార్డుకు చెందిన ఇద్దరు సభ్యులను చంపింది. ఆ దాడిని ఇటీవ‌లే ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండిస్తూ ఓ ప్ర‌క‌ట‌న చేసింది. ఈ దాడుల‌కు ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పింది. చెప్పిన విధంగానే మిసైల్స్ ప్రయోగం జరగడంతో క‌ల‌క‌లం చెల‌రేగింది అర్ధరాత్రి క్షిపణుల వర్షం కురిపించింది. ఈ ఘ‌ట‌న‌పై అధికారులు విచార‌ణ ప్రారంభించి, వివ‌రాలు తెలుసుకుంటున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement