Saturday, April 27, 2024

Breaking : పంప్ హౌస్ లో గ్యాస్ లీక్ .. ఇద్ద‌రు కార్మికులు మృతి..

వ్య‌ర్థ జ‌లాల పంప్ హౌస్ లో గ్యాస్ లీక్ కావ‌డంతో ఇద్ద‌రు కార్మికులు మ‌ర‌ణించారు. ఈ సంఘ‌ట‌న విశాఖ‌ప‌ట్ట‌ణం ప‌ర‌వాడ ఫార్మాసిటీలో చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో మ‌ణికంఠ‌, దుర్గాప్ర‌సాద్ మృతి చెందారు. వీరిది పాయ‌క‌రావుపేట‌గా గుర్తించారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కాగా విశాఖ‌లో గ్యాస్ లీక్ ఘ‌ట‌న‌లు మామూలు అయిపోయాయి. గ‌తేడాది మేలో ఎల్జీ పాలిమ‌ర్స్ ప‌రిశ్ర‌మ‌లో గ్యాస్ లీక్ ఘ‌ట‌న గురించి తెలిసిందే. ఆ ఘ‌ట‌న‌లో ప‌ది మంది ప్రాణాలు కోల్పాయారు. ఇప్పుడీ ఘ‌ట‌నతో మ‌రోసారి విశాఖ వాసులు ఉలిక్కి ప‌డ్డారు. ప‌రిశ్ర‌మ‌ల యాజ‌మాన్యం మాత్రం చూసీ చూడ‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement